CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 8:30 am Posted by : rakeshkashaveni12@gmail.com

మానవత్వానికి నిదర్శనం.. బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం

హుస్నాబాద్, జూలై 26(చైతన్యగళం):

హుస్నాబాద్ పట్టణంలోని 1వ వార్డులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మంద సదానందంను 1వ వార్డు కౌన్సిలర్ చెన్నబోయిన అనూష విద్యాసాగర్ యాదవ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇస్తూ తన సొంత నిధుల నుంచి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు

ఈ సందర్భంగా సదానందం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సహకారం అందిస్తానని విద్యాసాగర్ తెలిపారు. కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వి.వి. రమణ, మహిళా నాయకురాలు బోనగిరి రజిత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సింగరి, ఎన్‌ఎస్‌యూఐ పట్టణ అధ్యక్షుడు కూన విశ్వతేజ, 1వ వార్డు యువ నాయకులు సావుల వెంకట్, సావుల మధు, కాటుకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్థానికులు “రాజకీయాలకు అతీతంగా మానవత్వాన్ని చాటుతూ బాధిత కుటుంబానికి అండగా నిలిచిన విద్యాసాగర్ అభినందనీయుడు” అని ప్రశంసించారు.