CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 5:29 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఉప్పల్ రింగ్ రోడ్ పునఃప్రారంభం

ఉప్పల్, జూలై 25 (చైతన్యగళం):
ఉప్పల్ నుండి నారపల్లి వరకు నిర్మిస్తున్న బండారు రాజి రెడ్డి క్యారిడర్ ఫ్లైఓవర్ పనుల్లో భాగంగా గత రెండు నెలలుగా మూసివేసిన ఉప్పల్ రింగ్ రోడ్ శనివారం పునఃప్రారంభమైంది.

ప్రస్తుతం ఉప్పల్ నుండి వరంగల్ వైపు వెళ్లే మార్గాన్ని మాత్రమే తెరిచారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్ల రాకపోకలకు అనుమతించారు. భారీ వాహనాలను మాత్రం లిటిల్ ఫ్లవర్ స్కూల్ రహదారి మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు.

రింగ్ రోడ్ పునఃప్రారంభం కావడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.