CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 7:02 pm Posted by : CHAITHANYA GALAM NEWS

దేవరకొండలో మత్తు పదార్థాలపై విస్తృత తనిఖీలు

దేవరకొండ, జూలై 25 (చైతన్యగళం):
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎస్‌హెచ్‌ఓ రాజు ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో డాగ్ స్క్వాడ్ సహాయంతో నిషేధిత మత్తు పదార్థాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు.

స్థానిక బస్టాండ్, లాడ్జీలు, పాన్ షాపుల్లో పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, “గంజాయి సహా నిషేధిత మత్తు పదార్థాలను ఎవరైనా వినియోగించినా, రవాణా చేసినా వెంటనే సమాచారం ఇవ్వాలి. సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు సహకరించాలి” అని విజ్ఞప్తి చేశారు.