నీట్ పేపర్ లీకేజీపై నిరసన – ఇబ్రహీంపట్నంలో రాస్తారోకో
రంగారెడ్డి, జూలై 22 (చైతన్యగళం): నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో ప్రధాని నివాసం ముందు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై జరిగిన దాడిని ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ హైవేపై కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యం వహించారు. నిరసనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ ఆందోళనలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్...