CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 11:02 am Posted by : CHAITHANYA GALAM NEWS

ఓబీసీ కమిటీ ఆత్మీయ సన్మాన సభలో పాల్గొన్న ఈగ మల్లేశం

వర్ధన్నపేట, జులై 19(చైతన్యగళం): ఓబీసీ కమిటీ ఆత్మీయ సన్మాన సభలో కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ముఖ్యఅతిగా పాల్గొన్నారు. హన్మకొండ పట్టణంలోని మాస్టర్ జీ డిగ్రీ కళాశాలలో కుడా మాజీ చైర్మన్ మరియు ఓబీసీ చైర్మన్ ఎస్ సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో ఓబీసీల పాత్రను కొనియాడారు. అనంతరం ప్రతిష్టాత్మక పదవుల్లో నియమితులైన తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకట నారాయణ, మరియు మేర సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకటరాజం ను శాలువాతో ఘనంగా సత్కరించి, సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.