ఎలిగేడు, జూలై 16 (చైతన్యగళం):
ఎలిగేడు మండలంలోని నర్సాపూర్ గ్రామంలో డీ.ఎన్.ఎఫ్.డి నిధులతో రూ.5 లక్షల వ్యయంతో కొత్త సీసీ రోడ్డు నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి.సర్పంచ్ పల్లెర్ల వెంకటేశ్ గౌడ్ శంకుస్థాపన చేసి మాట్లాడుతూ, “గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని వందశాతం పూర్తి చేస్తాను. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందించడమే నా లక్ష్యం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవి, కార్యదర్శి లలిత, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.