రామగుండం, జూలై 13 (చైతన్యగళం):
రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సోదరుడు ధర్మేందర్ సింగ్ సతీమణి ఉమా రాణి మృతికి సోమవారం తుది వీడ్కోలు పలికారు.
కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పార్ధివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు.
ఆమె మృతిపట్ల పలువురు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.