పేదవారి కడుపు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-ఎమ్మెల్యే శ్రీగణేష్

కంటోన్మెంట్, జూలై 10 (చైతన్యగళం): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ క్యాంటీన్ అల్పాహార కార్యక్రమం శుక్రవారం రెజిమెంటల్ బజార్‌లోని మదర్ థెరిసా విగ్రహం వద్ద ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్ ఈ క్యాంటీన్‌ను ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పేద, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు కేవలం ₹5కే నాణ్యమైన, రుచికరమైన అల్పాహారం పొందేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మదర్ థెరిసా చూపిన సేవామార్గంలో, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.