CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 10:46 am Posted by : CHAITHANYA GALAM NEWS

వైఎస్సార్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర

నందికొట్కూరు (చైతన్య గళం):

నందికొట్కూరు పట్టణంలోని కర్నూల్ రోడ్ వైఎస్సార్ సర్కిల్ వద్ద రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఇన్చార్జ్ డా. ధారా సుధీర్ ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు మన్సూర్ ఆధ్వర్యంలో మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు జబ్బర్ మాట్లాడుతూ – వైఎస్సార్ పేదలు, రైతులు, విద్యార్థుల అభ్యున్నతి కోసం చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, 108 అంబులెన్స్ సేవలు వంటి పథకాలు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.