కమలాపూర్ (చైతన్యగళం): కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఝాన్సీ రాణి మాట్లాడుతూ, “నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ బలగం ఆశీస్సులతో జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు.
ఈ వేడుకల్లో డైరెక్టర్లు సముద్రాల కృష్ణ, జనగాని శివకృష్ణ, ఉరుసు తిరుపతి, చకిలం దయాకర్, మిల్కూరి శ్రీనివాస్, కెత్తే విజయేందర్, ఆకినపల్లి బిక్షపతి, నిగ్గుల లింగయ్య, వంటకాల అనిల్ రెడ్డి, కిన్నర కృష్ణమూర్తి, కార్యదర్శి జన్ను యాకయ్య పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులైన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాని రమేష్ గౌడ్, డాక్టర్ మౌటం కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్ల రమేష్, జిల్లా కార్యదర్శి విష్ణు దాసు, వంశీధర్ రావు, ఆడెపు విజయ, తడక శ్రీకాంత్, పోడేటి బిక్షపతి, చెరిపల్లి రామచంద్రం, కెత్తె రవి, గూడెపు మొగిలయ్య, మొత్తం రమేష్, పెరుమాండ్ల పరశురాములు, పుల్ల శోభన్, ఆన్ కార్ అశోక్, కంభంపాటి ప్రసాద్, జన్ను వేణు, వైనాల సాంబయ్య, గంధసిరి బిక్షపతి, వంగోజు రజిత, మాట్ల రాజేష్, చందబోయిన సాయి రామకృష్ణ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.