ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న చిన్నారి నిధిశ్రీ

కరీంనగర్, జూలై 8 (చైతన్యగళం): కరీంనగర్ నగరంలోని మంకమ్మతోటకు చెందిన ఐదేళ్ల చిన్నారి బొబ్బిలి నిధిశ్రీ పటేల్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్–2026లో తన పేరు నమోదు చేసుకుని విశేష గుర్తింపు పొందింది. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న నిధిశ్రీ నాలుగేళ్ల వయసులోనే తైక్వాండో సాధన ప్రారంభించింది. శిక్షణ ప్రారంభమైన కొద్ది నెలల్లోనే తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించి ప్రతిభ చాటింది. మే 27న ఒక రజత నిమిషంలో 112 తైక్వాండో కిక్స్ ప్రదర్శించిన వీడియోను ఇండియా...