వెల్దండ, జూలై 7 (చైతన్యగళం): వెల్దండ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు పుట్టరామ్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, కల్వకుర్తి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సత్యం, మాజీ జెడ్పిటిసి విజితా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పుట్టరామ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పుట్టరామ్ రెడ్డికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో వెల్దండ మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, పోలే అశోక్, వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, మాజీ ఎంపిటిసి జ్యోతి నిరంజన్, మాజీ ఎంపిటిసి లింగం, రాములు, అంజి మాస్టర్, జంగిలి యాదగిరి, జంగిలి ఆనంద్, ప్రవీణ్, తుంగ శీను, టైలర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.