CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 11:10 pm Posted by : rakeshkashaveni12@gmail.com

పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

కరీంనగర్ జూలై 6 (చైతన్య గళం):

కరీంనగర్ రూరల్ మండలంలోని శాతవాహన కాలనీలో డీటీఆర్ ఏర్పాటు, విద్యుత్ లైన్ నిర్వహణ పనుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు రూరల్ ఏడీఈ గడం రఘు తెలిపారు.

ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు రేకుర్తి సబ్‌స్టేషన్ పరిధిలోని రేకుర్తి, పాతవాడ, కొత్తవాడ, హనుమాన్ నగర్, సాలేనగర్, వి పార్క్ వెనుక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.

అలాగే మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు సమ్మక్క గద్దెలు, కంటి ఆసుపత్రి ప్రాంతం, ఇందిరమ్మ కాలనీ, స్వామి కాలనీ, షేకాబ్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు

విద్యుత్ వినియోగదారులు ఈ తాత్కాలిక అంతరాయానికి సహకరించాలని రూరల్ ఏడీఈ గడం రఘు విజ్ఞప్తి చేశారు.