వింధ్యావాలీ హైస్కూల్లో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు
కరీంనగర్, జూలై 04 (చైతన్య గళం): విద్యార్థుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన, క్రమశిక్షణను పెంపొందించే లక్ష్యంతో శనివారం మెహర్ నగర్ పాత డి-మార్ట్ సమీపంలో లోని వింధ్యావాలీ హైస్కూల్ లో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు రోడ్డు నిబంధనలు, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత, మరియు మైనర్ డ్రైవింగ్ మైనర్లు వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించారు. విద్యార్థులు తామే కాకుండా తమ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులుకూడాట్రాఫిక్నిబంధనలుపాటించేలా అవగాహన...