కరీంనగర్, జూలై 3 (చైతన్యగళం): కరీంనగర్ పర్యటనలో భాగంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ, చొప్పదండి ఎమ్మెల్యే & కరీంనగర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబుతో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అల్ఫోర్స్ డా. వి. నరేందర్ రెడ్డి శ్రీ కొండగట్టు ఆంజనేయ దేవస్థానంను సందర్శించారు.ఈ సందర్భంగా నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఆంజనేయ స్వామి ఆశీస్సులు కోరుకున్నారు.