ఎలిగేడు, జూలై 2 (చైతన్యగళం):
ఎలిగేడు మండల కేంద్రంలోని అంగనవాడీ సెంటర్–1లో గురువారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ కప్పల ప్రవీణ్ గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేశారు. అనంతరం ఏఎల్ఎంఎస్సీ కమిటీ సమావేశం కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, “అంగనవాడీ కేంద్రాల్లో అందజేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి. 3 నుండి 5 సంవత్సరాల పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా అంగనవాడీ కేంద్రాలకు పంపాలని తల్లిదండ్రులు గుర్తించాలి” అని సూచించారు.
కార్యక్రమంలో అంగనవాడీ టీచర్ జ్యోతి, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.