సైబర్‌ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి – సీఐ సత్యనారాయణ

యాచారం, జూలై 2 (చైతన్యగళం): సైబర్‌ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని, డ్రగ్స్‌ వలన కలిగే నష్టాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలని హైద్రాబాద్ గ్రీన్ ఫార్మా పోలీస్ స్టేషన్ సీఐ సత్యనారాయణ పిలుపునిచ్చారు.యాచారం మండలం కుర్ముద్ద ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్‌ నివారణ, సైబర్‌ భద్రత, స్మార్ట్‌ఫోన్‌ సద్వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ, “డ్రగ్స్‌ వాడకం విద్యార్థుల ఆరోగ్యం, చదువు, కుటుంబం, భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుంది....