వంగూరు, జూలై 2 (చైతన్యగళం):
వంగూరు మండలం కొండారెడ్డిపల్లి క్లస్టర్–5 వేదికగా రైతులకు పత్తి విత్తనాల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు కె.వి.ఎన్. రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు పత్తి విత్తనాలను అందజేశారు.సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చిమ్ముల రాజశేఖర్ రెడ్డి, స్థానిక సర్పంచ్, మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని, సింగిల్ విండో డైరెక్టర్లు, సంబంధిత అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.