CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 8:43 pm Posted by : CHAITHANYA GALAM NEWS

చిన్నారులను ఆశీర్వదించిన బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకులు

మర్రిగూడ, జూన్ 28 (చైతన్య గళం): మర్రిగూడ మండలం తానెదర్‌పల్లి గ్రామంలో ఆదివారం జరిగిన కుటుంబ వేడుకలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకుడు నారోజు కుమారస్వామి పాల్గొన్నారు.

జయ గార్డెన్‌లో జరిగిన నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో ఆయన చిన్నారులను ఆశీర్వదిస్తూ, “మంచి ఉన్నత విద్యలు అభ్యసించి దేశరక్షణకు పాటుపడాలి. హిందూ ధర్మ రక్షణ కోసం పోరాడుతూ ఉన్నత ఉద్యోగాలు సంపాదించి సనాతన ధర్మాన్ని కాపాడాలి” అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ బూత్ అధ్యక్షుడు వట్టికోట జగన్, ఎరగండ్లపల్లి బూత్ అధ్యక్షుడు అవాంఛల దామోదర్, పంగ లక్ష్మణ్, స్థానిక నాయకులు, తడి తరులు పాల్గొన్నారు.