వర్షాకాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు – జమ్మికుంట 3వ వార్డును సందర్శించిన మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ దిలీప్
కరీంనగర్ చైతన్యగళం జూన్ 26 జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డును మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ సందర్శించి వర్షాకాల పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ పరిధిలోని విలీన గ్రామం రామన్నపల్లిలో వరద నీటి సమస్యతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో జేసీబీలతో కచ్చా కాలువల నిర్మాణంతో పాటు ప్రత్యేక డ్రైవ్ ద్వారా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటూ...