CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 2:10 pm Posted by : CHAITHANYA GALAM NEWS

తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్లు ప్రారంభం..

తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రారంభించారు. రూ.51కోట్లతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన 33 కొత్త స్పీల్ వే గేట్లను ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, శివకుమార్ ప్రారంభించారు.

కర్ణాటక: తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రారంభించారు. రూ.51కోట్లతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన 33 కొత్త స్పీల్ వే గేట్లను ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, శివకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి శాఖామంత్రి సీఆర్ పాటిల్‌తో పాటు ఆయా రాష్ట్రాల మంత్రులు, అధికారులు, పార్టీల కార్యకర్తలు హాజరయ్యారు. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం విజయనగర జిల్లా హోసపేటలో జరిగే భారీ బహిరంగ సభకు కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రులు వెళ్లారు. సభలో మూడు రాష్ట్రాల సీఎంలు ప్రసంగించారు.