తెలంగాణలో నేటి నుంచే ఎస్ఐఆర్ సర్వే..
ఓటర్ల జాబితా నుంచి మరణించిన వారి పేర్లు, డూప్లికేట్, వలస వెళ్ళిన ఓట్లను తొలగించి. ఓటర్ల జాబితాలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ సర్వే ఇప్పుడు తెలంగాణలో కూడా షురువైంది. ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే ప్రారంభం కానుంది. ఇంతకూ సర్వే ఎలా జరుగుతుంది. ఎప్పటి వరకు జరుగుతుందో తెలుసుకుందాం పదండి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చేసింది. గురువారం నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా...